ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం దగ్గి వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. లింగంపేట మండలానికి చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగారు. వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్థానికులు యువతి, యువకుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కులాలు వేరుకావడంతో ప్రేమికుల వివాహానికి
పెద్దలు ఒప్పుకోలేదని సమాచారం.