ప్రేమజంట ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): వేములవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అకినేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన సింగతి విష్ణువర్ధన్‌ (26), యువతిగా గుర్తించారు. వీరు వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చినట్లు పోలీసులు నిర్దారించారు. ఘటనాస్థలిలో విష్ణువర్ధన్‌ ఆధార్‌కార్డ్‌ , సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రేమ జంట మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.