ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

నల్గొండ: యాదగిరిగుట్టలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమజంట పరిస్థితి  విషమంగా ఉండటంతో వారిని  హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట శ్రీమన్‌, శ్రీవాణిలు మెదక్‌ జిల్లా సంగారెడ్డి వాసులని పోలీసులు చెప్పారు.