ప్రైవేట్‌ హోటల్‌ ప్రారంభించిన మంత్రులు

కామారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కామారెడ్డిలో ఓ ప్రైవేటు హోటల్‌ను మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లు కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కంటివెలుగు పేదలకు వెలుగని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం అన్నారు.