ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో గోదాంలో నిలిపి ఉంచిన మూడు టాటా ఏసీ వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో అగ్నిప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి.