ఫ్లీనరికి తరళిన టీఆర్ఎస్ నాయకులు

 భీమ్ గల్, ఏప్రిల్ 27, (జనంసాక్షి) : హైదరాబాద్ లోని కొంపల్లి లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరి‌ బహిరంగ సభకు శుక్రవారం భీమ్ గల్ టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు‌ తరళి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గుణవీర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్డీ 17 వసంతాల పండుగా జరుపుకుంటున్న వేళ, టీఆర్ఎస్ పార్టీ గత 14 సంవత్సరాలుగా తెలంగాణ కోసం అలుపెరగని పోరాటలు చేసిందన్నారు. బంగారు తెలంగాణ కోసం అహర్షిశలు‌ కృషి చేస్తున్నది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని అన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడుతున్నరన్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బాదవత్ శర్మనాయక్, భీమ్ గల్ సర్పంచ్ గుగులోత్ రవినాయక్, భీమ్ గల్ సోసైటి ఛైర్మన్ చౌట్ పల్లి రవి, బాబాపూర్ ఎంపిటిసి మోహిజ్, శ్రీరాముల హన్మచారి, బెజ్జోర సుమన్, జైరాం శ్రీనివాస్, పర్స నవీన్, ఓమాయి రాజేశ్వర్ లు ఫ్లీనరికి తరళి వెళ్ళారు.