బయోడీజిల్ ట్యాంకర్ బోల్తా..
సూర్యాపేట: బయోడీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటన జిల్లాలోని చివ్వెల మండలం బీబీ గూడెం దగ్గర చోటు చేసుకుంది. ఈ ఘటనలో ట్యాంకర్లో ఉన్న రూ.30లక్షల విలువైన డీజిల్ నేలపాలైంది. స్థానికులు నేలపాలైన డీజిల్ను బకెట్లతో తీసుకెళ్తున్నారు.