బాబుతో సింగపూర్‌ మంత్రి భేటీ

అమరావతి,నవంబర్‌17(జ‌నంసాక్షిఎ): సింగపూర్‌ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో అమరావతిలో భేటీ అయ్యారు. ఈశ్వరన్‌ శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి చంద్రబాబునాయుడు స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీని, సచివాలయాన్ని ఈశ్వరన్‌కు చంద్రబాబు చూపించారు. కాగా… అమరావతిలో సింగపూర్‌ సంస్థలు చేపట్టే ప్రాజెక్టులపై వీరి మధ్య చర్చ జరిగింది. అతి తక్కువ సమయంలో ఇక్కడ సచివాలయం, అసెంబ్లీ నిర్మించిన తీరును ప్రశంసించారు.