బాబు దీక్షకు మద్దతుగా దీక్ష

శ్రీకాకుళం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఢిల్లీలో సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా.. రాష్ట్రంలోని పలు జిల్లాలో టిడిపి శ్రేణులు సోమవారం దీక్ష చేపడుతున్నారు. శ్రీకాకుళంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద టిడిపి నాయకులు దీక్ష నిర్వహించారు. నల్ల చొక్కాలు ధరించి ‘ ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కు ‘ అనే ప్లకార్డులతో నిరసన తెలిపారు. మరో వైపు.. తూర్పు గోదావరిలో కాకినాడ రూరల్‌ నియోజకవర్గ స్థాయిలో సర్పవరం జంక్షన్‌ వద్ద టిడిపి నేతలు ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి ప్రధాన కార్యదర్శి పిల్లి సత్తిబాబు పాల్గొన్నారు.