బాలుడి దారుణహత్య

 

నల్లగొండ,నవంబర్‌13(జ‌నంసాక్షి): నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏడేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి ఇంటి పైకప్పు విూద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన కడపర్తిలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు తన కుమారుడు సాత్విక్‌ అదృశ్యమయ్యాడని తండ్రి రమేష్‌ నకిరేకల్‌లో వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల తన ఇంటి పైకప్పు విూద బాలుడి మృతదేహం గుర్తించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.