బిఆర్కె భవన్ వద్ద ట్రాఫిక్ నిషేధం
హైదరాబాద్,ఆగస్ట్17(జనం సాక్షి): సచివాలయాన్ని బీఆర్కే భవన్కు తరలించడంతో ఇప్పుడుఉ ఈరోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను జిహెచంఎంసి, బిఆర్కె భవన్ వైపు
అనుమతించడం లేదు. రద్దీ పెరిగిన దృష్ట్యా శనివారం నుంచి జీహెచ్ఎంసీ టీ జంక్షన్ గుండా సాధారణ ట్రాఫిక్ను నిలిపివేస్తున్నారు. లిబర్టీ, బషీర్బాగ్ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులను టీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వైపు అనుమతిస్తారు. వాహనదారులు అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, రవీంద్రభారతి, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ దారులను వినియోంగిచుకోవాలని అధికారులు సూచించారు.