బిజెపికి అడ్రస్‌ లేకుండా చేస్తాం: పల్లె

పుట్టపర్తి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కు అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పుట్టపర్తిలో దీక్ష చేపట్టిన పల్లె మాట్లాడుతూ విభజన చట్టంలో అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం కోసం ధర్మపోరాట దీక్ష చేస్తున్న నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు.ఎపిని అడ్డంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీని తెలుగు ప్రజలు అడ్రస్‌ లేకుండా చేశారని.. హావిూలు, ప్రత్యేక ¬దాపై మాటమార్చిన బిజెపికి, మోడీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  జన్మదినాన, జన్మనిచ్చిన భూమి కోసం సిఎంతో పాటు ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నెల 21 నుంచి టిడిపి ఆధ్వర్యంలో జరిగే సైకిల్‌ యాత్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పల్లె రఘునాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. టిడిపి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు.