బిజెపిలో చేరిన యువకులు

మల్దకల్‌. జ‌నంసాక్షి

మండల కేంద్రానికి చెందిన ఇరవై మంది యువకులు గురువారం బిజెపి జిల్లా అద్యక్షులు ఉప్పేరు శ్రీనివాసరెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు హాజరు కాగా పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు యువకులు తెలిపారు. వచ్చే ఎన్నికలలో బిజెపి జెండ ఎగురవేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బ్రహ్మాజిరావు, మహిళా నాయకురాలు దేవయాని, కార్యదర్శి శ్రీనివాస్‌, మండల నాయకులు పాల్గోన్నారు.