బిజెపి కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం

 బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
వరంగల్ ఈస్ట్,  సెప్టెంబర్ 26(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని 38 వ డివిజన్ బిజెపి కార్యకర్తలపై అనుచితంగా భౌతిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.
ఇంకా పై ప్రతి దాడులు తప్పవని వరంగల్ తూర్పు బిజెపి నాయకులు శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు సోమవారం హెచ్చరించారు…
డివిజన్ లో బిజెపి తూర్పు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్ పై మాజీ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ దాడి చేయడాని హేయమైన చర్యగా అభివర్ణించారు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని అన్నారు..దామోదర్ యాదవ్ పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రదీప్ రావు కోరారు.
Attachments area