బీజేపీలోకి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య

హైదరాబాద్‌,సెప్టెంబర్‌13(జనంసాక్షి): మాజీ మంత్రి సుద్దాల దేవయ్య నేడో, రేపో బీజేపీలో చేరనున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, అంతకుముందు కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆయన సేవలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. బీజేపీలో చేరికపై ఆయన ఇప్పటికే స్థానిక ఎంపీ బండి సంజయ్‌, రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ప్రకటనచేస్తారని అంటున్నారు.