బుల్లెట్‌ ట్రైన్‌ భూములపై మాట్లాడండి

బిజెపి నేతలకు పంచుమర్తి చురకలు

విజయవాడ,నవంబర్‌19(జ‌నంసాక్షి): బుల్లెట్‌ ట్రైన్‌ పేరుతో లక్ష ఎకరాల కబ్జాకు బీజేపీ ప్రయత్నించిందని

టీడీపీ నేత పంచుమర్తి అనురాధ విమర్శించారు. చేతనైతే కన్నా లక్ష్మినారాయణ, జీవీఎల్‌ నరసింహారావు అక్కడ దీక్షలు చేయాలన్నారు. సోమవారం ఆమె విూడియాతో మాట్లాడుతూ కన్నా, జీవీఎల్‌ గల్లీ లీడర్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. భూసంరక్షణ పేరుతో అమరావతిలో వారు దందా మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన భూసవిూకరణపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని అనురాధ మండిపడ్డారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారని ఆమె అన్నారు. పటేల్‌ విగ్రహం పేరుతో 20వేల ఎకరాల భూమి లాక్కోని.. గిరిజనులకు బీజేపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ సంస్థను పెంచి పోషించింది కన్నా గ్రూప్‌ కాదా? అని పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు.