బూసెనెల్లి లో ఘనంగా మాడివాల మచిదేవుని జయంతి వేడుకలు
బూసెనెల్లి లో ఘనంగా మాడివాల మచిదేవుని జయంతి వేడుకలు
జహీరాబాద్ ఫిబ్రవరి 1 (జనంసాక్షి.)జహీరాబాద్ మండలంలోని బూసేనెల్లి గ్రామంలో మాడివాల మచిదేవా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరాధ్య దైవం అయిన మడివాల మచిదేవా ని జయంతి వేడుకలు సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జహీరాబాద్ పట్టణంలో జరిగిన రజక సోదరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రాంజోల్ గ్రామంలో బహిరంగ సభ పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో రజక సంఘం నియోజకవర్గ అధ్యక్షులు అల్గోల్ బక్కప్ప, చంద్రశేఖర్, యూత్ నాయకులు మహేష్, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపిటిసి బస్వరాజు నియోజకవర్గంలో ని రజక సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు.