బెంగాల్‌ను మంచెత్తిన వరదలు

9lct00l4పశ్చిమ బెంగాల్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో జల్‌పాయ్ గురిలో జన జీవనం స్థంభించింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. అధికారులు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు అస్సాంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దిగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో దిబుఘర్ ప్రాంతంలో నదులు ప్రమాదకర పరిస్థితి నెలకొంది.