బోటు మునక సహాయక చర్యలకు హెలికాప్టర్

తూర్పుగోదావరి: పాపికొండల టూర్‌కు బయలుదేరిన బోట్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది. 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని కచులూరు వద్దకు పంపారు. రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా 25 మంది ఆచూకి తెలియాల్సి ఉంది.