బోస్‌ మ్యూజియం ప్రారంభించిన మోడీ

న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 122వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. నేతాజి విగ్రహానికి పూలమాలలేస నివాళ్లు అర్పించారు. ఎర్రకోట వద్ద బోస్‌ మ్యూజియంను ఆయన ప్రారంభించారు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ మ్యూజియంలో నేతాజీకి చెందిన అనేక వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. గతేడాది అక్టోబర్‌ 21న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మ్యూజియం కోసం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. సరిగ్గా మూడు నెలల తరువాత బుధవారం ఆయన జయంతి సందర్భంగా మ్యూజియంను ప్రారంభించారు.