బ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎసిబి సోదాలు

 

కడప,నవంబర్‌14(జ‌నంసాక్షి): పులివెందులలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం ఏసిబి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.1,24,230 నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక కంప్లైంట్లు రావడంతో పులివెందుల సబ్‌ రిజిస్టర్‌ ఆఫీసుపై మధ్యాహ్న సమయంలో ఏసిబి అధికారులు, డిఎస్‌పి నాగరాజుల ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతోన్నాయి. ప్రభుత్వ చలానాల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని సమాచారం రావడంతో ఆకస్మికంగా డాక్యుమెంట్‌ రైటర్స్‌ పై, ప్రైవేట్‌ సిబ్బంది పై సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై ఎసిబి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అనధికారికంగా ఉన్న రూ.1,24,230 నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.