భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

ఖమ్మం: భద్రాచలం ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను ఈవో సస్పెండ్‌ చేశాడు. విధుల పట్ల ముగ్గురు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఈవో వారిపై వేటు వేశారు. మద్యం సేవించి ఆలయానికి రావడమే కారణమని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. మద్యం సేవించి ఆలయానికి రావడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు అంటున్నారు.