భద్రాచలం వద్ద గోదావరిలో నలుగురు గల్లంతు:ఒకరి మృతి

ఖమ్మం:భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన వారిలో చిన్నారి వైశాలి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే…నిజామాబాద్‌కు చెందిన విఠల్‌.. కుటుంబ సభ్యులు గీత, మోహన్‌, వైష్ణవి, చిన్నారి వైశాలితో కలిసి రాముల వారి దర్శనం కోసం భద్రాచలం వచ్చారు. వీరంతా కలిసి గోదారి స్నానఘట్టాల వద్ద స్నానాలు చేస్తుండగా కాలుజారి గల్లంతయ్యారు. అక్కడే ఉన్న భక్తులు గమనించి నలుగురిని కాపాడారు. కానీ పాప వైశాలి మృతిచెందింది. దీంతో విఠల్‌ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.