భద్రాద్రిలో టిఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): భద్రాచలంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం ఉధృతం చేసింది. రామాలయ సవిూపంలోని బ్రాహ్మాణ వీధులలో ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావ్‌ ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా రామాలయ తూర్పు మెట్ల నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆంజనేయ విలాస్‌ ¬టల్‌ దగ్గర దర్శనం కోసం వచ్చిన భక్తులకు నాస్టా అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌చార్జ్‌ రామకృష్ణ, మండల అధ్యక్షుడు నగేష్‌, గ్రంథాలయ ఛైర్మన్‌ మామిడి పుల్లారావు పాల్గొన్నారు. టిఆర్‌ఎస్‌ మాత్రమే అన్నివర్గాలకు న్యాయం చేయగలదన్నారు. భద్రాద్రి అభివృద్ది చెందాలంటే కెసిఆర్‌ సిఎం కావాలన్నారు.