భద్రాద్రిలో బంగారు తులసీ అర్చన

భద్రాచలం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): భద్రాచలం రామాలయంలో శనివారం రోజువారీ పూజలతో పాటు వారానికి ఒకసారి నిర్వహించే బంగారు తులసి అర్చన ఘనంగా జరిగింది. బంగారంతో తయారు చేసిన తులసి దళాలను సీతారాముల వారి పాదాల వద్ద ఉంచి అర్చన చేశారు. నిత్య కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శనివారం కావడంతో ప్రత్యేక పూజలకు భారీగా భక్తులు తరలివచ్చారు. వర్షం పడుతున్న స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. దీనికితోడు శ్రావణం సదర్భంగా ఆదివారం నుంచి ప్రత్యేక పూజలకు భద్రాద్రి సిద్దం అవుతోంది. స్వామికి ఈ నెలరోజులపాటు వివిధ రకాల పూజలు నిర్వహిస్తారు.