భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేయాలి : సిఐటియూ

నల్లగొండ,జూన్‌12(జ‌నం సాక్షి): భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 18 రకాల విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. అందులో 8 లక్షల మంది కార్మికుల పేర్లు మాత్రమే సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నాయని నేతలు చెప్పారు. మరికొంత మంది వలసలు పోతు న్నారన్నారన్నారు. అడ్డాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో మౌ లిక వసతులు కల్పించాల్సిన లేబర్‌ శాఖ అధికారులు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.ఈ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఇసుక పాలసీపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల పోషణ భారమై అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సెస్‌ ద్వారా సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు కార్మి కుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లించడం సరికాదన్నారు. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించొద్దన్నారు. సిమెంట్‌, ఐరన్‌, రంగులు, ఇతర ముడి సరుకుల ధరలు నియంత్రించి వాటిని ప్రభుత్వ మే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. పెట్టుబడిదారులు, బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు మాత్రం కూలి పెంపు, రుణాలివ్వడం లేదన్నారు.