భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తో పాటు

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తో పాటు యాత్రలో పాల్గొన్న రాష్ట్ర సర్పంచుల ఫోరం మహిళ అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ కొండమల్లేపల్లి డిసెంబర్ 2 జనం సాక్షి న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక చేపట్టిన భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీ తో పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దేవరకొండ మండలం తాటికోల్ గ్రామ సర్పంచ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర సర్పంచుల ఫోరం మహిళా అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ జోడోయాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అశేష జనవాహిని, రైతులు, ప్రజలు, వివిధ రకాల వర్తక వ్యాపారస్తులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భారీ జన సందోహం మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జోడో యాత్ర కొనసాగుతుందని తెలిపారు భారత్ జోడోయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై ప్రశంసలు కురిపిస్తున్నారని రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆమె ఆశాభవం వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన గాలికి వదిలేసి తమ తమ పార్టీ స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని విమర్శించారు ప్రజలు నిత్యవసర ధరలు పెరగడంతో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్య ప్రజలు కోలుకోలేకపోతున్నారని విమర్శించారు కరోనా సమస్య, నోట్ల రద్దు సమస్యతో చిన్నచిన్న వ్యాపారస్తులు అతలాకుతలమయ్యారని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు విసుకు చెందారని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీజీ దేశ ప్రధాని గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు