పట్టాలు తప్పిన రైలు: నదిలో 22 బోగీలు

51486977515_625x300కాలిఫోర్నియా: ఓ రైలు పట్టాలు తప్పడంతో, రైలులోని 22 బోగీలు నీటిలో పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ రైలులో కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండడంతో ప్రాణ హాని తప్పింది. కాలిఫోర్నియాలోని గ్రేటర్ శాన్‌ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో ట్రేసీ సిటి నుంచి స్కార్‌మెంటో మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రోజ్‌విల్లేకు ఆహారపదార్థాలను తరలిస్తున్న గూడ్స్ రైలు ఎల్క్‌గ్రోవ్ సిటీకి వచ్చేసరికి పట్టాలు అదుపు తప్పింది. 33 బోగీలున్న రైలు ఈ ప్రమాదంలో 22 బోగీలు కోసుమీస్ నది పడిపోయాయని, అయితే ఆ సమయంలో ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణిస్తుండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని యూనియన్ పసిఫిక్ రైల్వేబోర్డు అధికారులు తెలిపారు.