భార్యను రైలు నుంచి తోసేశాడు

చినగంజాం: ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం కడవకుదురు వద్ద దారుణం జరిగింది. బుధవారం తెల్లవారుజామున విజయవాడ వైపు వెళ్తున్న తమిళనాడు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నుంచి ఓ వ్యక్తి తన భార్యను తోసేశాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విజయవాడ రైల్వే పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రిజర్వేషన్‌ చార్టు ప్రకారం పరిశీలించగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంతోష్‌కుమార్‌, కల్పనగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కల్పన మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.