భార్య చనిపోయిందని.. నకిలీ పత్రాలతో రూ.5 లక్షలు స్వాహా

నల్గొండ: భార్య బతికుండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి భీమా సొమ్మును కాజేసిన ఓ భర్త ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కిషన్ నాయక్ అనే వ్యక్తి ఎల్ఐసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే… భార్య పేరుమీద ఎల్ఐసీ పాలసీ ఉండగా వాటిమీద అతని దృష్టి పడింది. ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. చిరకు తన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఎల్ఐసీ కార్యాలయంలో ఇచ్చి రూ. 5లక్షల భీమా సొమ్మును కాజేసాడు. అయితే… ఈ విషయం కాస్త శనివారం వెలుగులోకి రావడంతో అతని మోసం బయటపడినట్లైంది.