భూతగాదాలతో ఘర్షణ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ,జూన్‌18(జ‌నం సాక్షి): కొండమల్లేపల్లి మండలం జైత్యతండాలో భూ వివాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వర్గాల మధ్య గొడవ ఎక్కువ అవడంతో.. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జైత్యతండాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.