భూతగాదాలతో వ్యక్తి హత్య

నల్లగొండ,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): నల్లగొండ మర్రిగూడ మండలం వెంకేపల్లి తండాలో దారుణం జరిగింది. భూతగాదాలు ఓ వ్యక్తిని బలి తీసుకున్నాయి.  భూతగాదాలతో రమావత్‌ లచ్చు అనే వ్యక్తిని జంగయ్య అనే మరో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇరుగుపొరుగు అందించిన సమాచారంతో వెంకేపల్లికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యతో మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.