భూతగాదాలతో వ్యక్తి హత్య

నల్లగొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): మోతె మండలంలోని రాంపురం తండాలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన భూతగాదాలో తమ్ముడు హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అంగోతు సైదులు, హేమ్లా ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొన్నేళ్లుగా పొలం గట్టుకు సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున చేను వద్ద ఉన్న హేమ్లా, అతని కుమారుడు ఉపేందద్రపై సైదులు మరికొంతమందితో కలసి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో హేమ్లా(60) అక్కడికక్కడే మృతిచెందగా అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కోదాడ డీఎస్పీ సుదర్శన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.