భూములిచ్చిన వారికి హావిూలు విస్మరించారు

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  జలాశయాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వ తీరుతో సంతోషంగా లేరని అన్నారు. జిల్లాలో కర్వెన జలాశయంతోపాటు పలు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులను లాభదాయకమైన పరిహారమే కాకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తానని వాగ్దానమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. నష్టపరిహారం కొందరికి మాత్రమే అందిందని, పూర్తిస్థాయిలో అందించలేదని పేర్కొన్నారు.