భూసమస్యలను పరిష్కరించుకోండి

కర్నూలు,జూన్‌20(జ‌నం సాక్షి ): రైతుల భూసమస్యలను పరిష్కరించుకోవాలని పగిడ్యాల తహసీల్దార్‌ కుమారస్వావిూ ఆన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పగిడ్యాలలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి పి. దివ్య మాట్లాడుతూ రైతులు రెవెన్యూ సదస్సును వినియోగించుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం చుక్కల భూములు ఉన్న పొలాలను జిల్లా కలెక్టర్‌ క్రమబద్దీకరించిన ఉత్తర్వులను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యాక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.