భూస్వాములకు రైతుబంధు కాదు అనాధలను ఆదుకోండి..

మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో . ఫిబ్రవరి 6. (జనంసాక్షి). భూస్వాములకు మంత్రులకు రైతుబంధు ఇవ్వడం అవసరం లేదని అనాధలకు చేయూత అందించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ అనాధల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు, మల్లారెడ్డి లాంటి మంత్రికి రైతుబంధు ఇవ్వవలసిన అవసరం లేదని అనాధల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం అనాధల సంక్షేమ చట్టం అమల్లోకి తీసుకురావాలని ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కానాపురం లక్ష్మణ్ , ఆవునురి ప్రభాకర్ గుండా థామస్ తదితరులు పాల్గొన్నారు.