భూస్వామ్య, సామ్రాజ్యవాద, పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాంభూస్వామ్య, సామ్రాజ్యవాద, పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం*  పి ఓ డబ్ల్యు జిల్లా గౌరవ అధ్యక్షురాలు నోముల కళావతి              


టేకులపల్లి,ఫిబ్రవరి 2( జనం సాక్షి): ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం టేకులపల్లి మండల కేంద్రంలో, బద్దుతండా పంచాయతీ నంద్యాతండా లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా  పి ఓ డబ్ల్యు జిల్లా గౌరవ అధ్యక్షురాలు నోముల. కళావతి, పి ఓ డబ్ల్యు  జిల్లా నాయకురాలు బద్దుతండా పంచాయతీ సర్పంచ్ భూక్య చిన్ని   మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు  ఫిబ్రవరి 7,8 తేదీ లో మహబూబాబాద్ పట్టణంలో జరగనున్నందున  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మహిళలను కోరారు.   కేంద్ర ప్రభుత్వం హిందూత్వన్ని నిస్సిగ్గుగా అమలు జరుపుతున్నది  పాసిస్టు రాజకీయాలు స్త్రీ ల జీవితాల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి అని వారు అన్నారు.  అదే విధంగా ఈ రోజు దేశం లో మహిళలు ఉత్పత్తి సాధన మైన భూమి పై హక్కుని కోరుతున్నారు  అధిపత్య కులాల, వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా ఆత్మ విశ్వాసం తో పోరాడాలని పిలుపునిచ్చారు.  రెండు రోజులు పాటు జరిగే ఈ మహాసభలో  మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్యదర్శి తొటకూరి చిట్టమ్మ, చింత లాలమ్మ, లక్ష్మి, కౌసల్య, రాజేశ్వరి, కమల, వసంత, కృష్ణవేణి, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు భూక్య. హర్జ్య, మండల కార్యదర్శి భూక్య. నర్సింగ్, పి వై ఎల్  మండల కార్యదర్శి తొటకూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.