మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు,  5 ట్రాక్టర్లు, ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల వల్ల నేర ప్రవృత్తిని కలిగిన వారిని., అక్రమ దందాలు చేసేవారిని పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని ఆయన అన్నారు.  గుర్తు తెలియని వ్యక్తులు ఇల్లు అద్దె కోసం వస్తే వారికి సంబంధించిన అన్ని వివరాలను తీసుకున్న తర్వాత వారికి ఇంట్లో అద్దెకు ఉండనివ్వాలంటూ సూచించారు.