మంచిర్యాలలో పోలింగ్‌ పరిశీలించిన శశాంక్‌ గోయల్‌ 

మంచిర్యాల,డిసెంబర్‌ 10 జనంసాక్షి:   ఉమ్మడి ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల వరకు 70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు పేర్కొన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని శశాంక్‌ గోయల్‌ సూచించారు.