మంత్రాలనెపంతో దంపతులపై గొడ్డళ్లతో దాడి

నెక్కొండ(వరంగల్ జిల్లా): నెక్కొండ మండలం బిక్యాతండాలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాల నెపంతో గ్రామానికి చెందిన గుగులోత్ రాజమ్మ(60), శత్రు(65) అనే దంపతులపై ఐదుగురు వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.