మంత్రిపైనే హత్యకు కుట్రలా

మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
మహబూబ్‌నగర్‌,మార్చి 3(జనం సాక్షి): మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్యకు కుట్రపన్నడం దారుణం. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగడం దురదృష్టకరమని జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జడ్చర్చ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డితో కలిసి విూడియాతో మాట్లాడారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గాని ఇలాంటి కుట్ర పన్నడం దుర్మార్గం అన్నారు.
సీఎం కేసీఆర్‌, మంత్రి విూద నిందలు వేశారు. కిడ్నాప్‌లు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఇలాంటి ఘటనలు ఖండిరచాలన్నారు. మంత్రికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమ నాయకుడు, ప్రభుత్వంలో క్రియాశీల నాయకుడిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర చేయడం దారుణమన్నారు. తెలంగాణ పోలీసులు తొందరగా స్పదించడం తోనే ఇంత పెద్ద కుట్ర బయటపడిరదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టమన్నారు.