మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీని ఘనంగా సన్మానించిన బోయిన్ పేట్

 

 

 

 

ముదిరాజ్ కుల సంఘం జనం సాక్షి, మంథని :ఇటీవల మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ ని, ఉపాధ్యక్షులు నరెడ్ల కిరణ్, కార్యదర్శి గుండా రాజు, డైరెక్టర్ లైన అంకరి కుమార్,గుండా రాజు,కుంట బద్రి,గుండా సాగర్, బయ్య రాజేష్ మరియు సిలివేరి భూమయ్య లను బోయిన్ పేట్ ముదిరాజ్ సంఘం నాయకులు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పోతరవేని క్రాంతి మాట్లాడుతూ..మత్స్యకార్మికుల అభివృద్దే ధ్యేయంగా నిరంతరం పాటుపడుతామని, మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం సమస్యలనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కార దిశగా పోరాడుతామని తెలిపారు. తన మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు మత్స్యశాఖ సంఘం సభ్యులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం నాయకులు పోలు కనుక రాజ్,సబ్బని సమ్మయ్య, పోతరవేని అర్జున్,గుండా రాజబాబు, కాయితి సమ్మయ్య,మబ్బు నాగరాజు, పొలు శివ, సుంకరి జగదీష్, తీగల సమ్మయ్య, పోలు రామకృష్ణ లు మరియు సంఘం సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.