మఠంలో గుట్కా స్వాధీనం

తిరుమల,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తిరుమలలోని ఓ మఠంలో నిషేధిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తిరుమల గోగర్భం ప్రాంతంలోని ఓ మఠంలో పోలీసులు దాడులు జరిపారు. వారికి గుట్కా, పాన్‌పరాగ్‌ పొట్లాలు లభ్యమయ్యాయి. పవిత్రమైన ప్రదేశంలో నిషేధిత వస్తువులు కలిగి ఉండడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మఠం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.