మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి..

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ యువకుడు ఇంటి పైనుంచి పడిన ఘటన సైదాబాద్‌లో చోటు చేసుకుంది. సైదాబాద్‌లో గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.