మధ్యప్రదేశ్‌లో విషాదం

– గణెళిష్‌ నిమజ్జనానికి వెళ్లి 11మంది మృతి

– గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సహాయక బృందాలు

భోపాల్‌, సెప్టెంబర్‌13 (జనంసాక్షి): మధ్యప్రదేశ్‌లో గణెళిష్‌ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది… 11 మంది జలసమాధి అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌ సవిూపంలోని ఖట్లాపుర ఘాట్‌ దగ్గర వినాయక నిమజ్జనానికి బోటులో వెళ్లారు.. బోటు నీళ్లలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. మరో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 సమయంలో ఖట్లాపుర ఘాట్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గణెళిష్‌ నిమజ్జనం కోసం 16 మందిని తీసుకెళ్తున్న బోట్‌ ఒక్కసారిగా మునిగిపోయింది. వెంటనే గజ ఈతగాళ్లు స్పందించి ఐదుగురిని కాపాడారు. మిగతా వారిని కాపాడలేకపోయారు. మొత్తం 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా ఎవరైనా నీటిలో ఉండిపోయారా అన్న అనుమానంతో గాలింపు చర్యలను ముమ్మరం  చేశారు.  40మంది పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు నిర్వహించారు.  ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ మంత్రి పీసీ శర్మ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. 11మంది చనిపోవడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు ఆనందంగా గడిపిన వారు.. ఇంతలోనే ప్రమాదం బారిన పడి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది.