మన్మధస్వామి పాదయాత్రను విజయవంతం చేయండి

మఠాధిపతి సోమయ్యప్ప
బిచ్కుంద (జనంసాక్షి)
ఈ నెల 22 నుండి నవంబర్ 3 వరకు బిచ్కుంద నుండి మన్మధస్వామి వరకు పాదయాత్ర ఉందని బిచ్కుంద మండలకేంద్రంలోని మఠాధిపతి సోమయ్యప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల సమయంలో పాదయాత్ర మహోత్సవం ఉందని అన్నారు. ఎక్కువ మంది భక్తులు హాజరై పాదయాత్ర మహోత్సవ కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరారు. బిచ్కుంద నుండి మహారాష్ట్ర లోని మన్మధస్వామి వరకు పాదయాత్ర ఉందని, పాదయాత్రలో భక్తులందరికి ప్రసాదం మరియు భోజన సదుపాయం కలదని అన్నారు.
ఇట్టి పాదయాత్ర మహోత్సవానికి జహిరాబాద్ పార్లమెంట్ సభ్యుడు భీమ్రావ్ బస్వంత్ రావ్ పాటిల్, జుక్కల్ శాసనసభ సభ్యుడు హన్మంత్ షిండే మరియు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం.