మరుగుదొడ్లు లేకపోవటంపై న్యాయమూర్తుల అసంతృప్తి

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు లేకపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్‌కుమార్‌ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జిల్లాపరిషత్‌ పాఠశాలలోని మౌలిక వసతులను వారు పరిశీలించారు. ఏకలవ్య ఫౌండేషన్‌ పర్యవేక్షణలో సీసీఐ నిధులతో నిర్మించిన బాలికల మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం బాగుందన్నారు. వారి వెంట డీఈవో సత్యనారాయణ, ఆర్వీఎం పీవో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.