మరో రెండు రోజుల పాటు వడగాలులు:వాతావరణ శాఖ

హైదరాబాద్:మరో రెండు రోజులపాటు తెలుగు రాష్ర్టాల్లో వడగాలులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టు పేర్కొంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.