మలేషియాలో నిర్మల్‌ వాసి మృత్యువాత


నిర్మల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): జిల్లాలోని ముధోల్‌ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) అనే వ్యక్తి మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. రాజన్న జీవనోపాధి కోసం మలేషియా వెళ్లాడు. కాగా రాజన్న మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.