మల్లాపూర్ వార్డు కార్యక్రమంలో ఘనంగా రాఖీ పండుగ

నాచారం(జనంసాక్షి):   మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకురాళ్లు చింతపల్లి ఆండాలు , బూరుగు సుశీల, ఎం.డి పర్వీన్, ఎం.డి  రహేనా స్థానిక మహిళలు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కి రాఖీ కట్టి , మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న చెల్లెళ్ళ అనురాగ బంధానికి..
అక్కా తమ్ముళ్ల ఆప్యాయ బంధానికి ప్రతీక  , అలాగే అన్నతమ్ముళ్ళు తమ అక్కాచెల్లెళ్లకు ఏ కష్టమొచ్చినా ఎల్లవేళలా అండగా నిలబడుతారని భరోసాను నింపే పండుగ రక్షా బంధన్ అని  అన్నారు.